బదిలీపై వెళ్తున్న ఎస్సై వరప్రసాద్కు ఘన సన్మానం
తలకొండపల్లి/నవోదయం, ఆగస్టు 20: కడ్తాల్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహించిన BSS వరప్రసాద్ కొందుర్గు పోలీస్ స్టేషన్కు ఎస్హెచ్ఓగా బదిలీ అయిన సందర్భంగా రాంపూర్ గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల–శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎస్సై వరప్రసాద్ విధి నిర్వహణలో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపారని కొనియాడారు. ప్రజల మన్ననలు పొందిన ఆయన సేవలు ప్రశంసనీయమన్నారు. పోలీసు శాఖలో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు మరింత సేవలందించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో అంతారం సర్పంచ్ బాలస్వామి, రాంపూర్ చెరువు సొసైటీ జనరల్ సెక్రెటరీ చిలుకం శేఖర్, యువ నాయకులు మొత్తాల నరసింహ గౌడ్, రొయ్యల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
బదిలీపై వెళ్తున్న ఎస్సై వరప్రసాద్కు ఘన సన్మానం
Quick Summary:
బదిలీపై వెళ్తున్న ఎస్సై వరప్రసాద్కు ఘన సన్మానం